Home / Gaza
ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజాపై వైమానిక దాడిలో టాప్ హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీ హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్) బుధవారం ప్రకటించింది.ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని హతమార్చాయి అక్టోబర్ 7న జరిగిన హంతక ఉగ్రవాద డికి కారణమైన నాయకులలో బియారీ ఒకరు అని ఐడిఎఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో పేర్కొంది.
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గత 24 గంటల్లో 700 మంది మరణించారు. మరోవైపు గాజాలో విద్యుత్హ కొరణంగా ఆసుపత్రుల్లో వైద్యనదుపాయాలు నిలిచిపోయాయని దీనితో మరిన్ని మరణాలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.
గాజా స్ట్రిప్ ప్రాంగణంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుండి శరణార్థుల కోసం ఉద్దేశించిన ఇంధనం మరియు వైద్య సామాగ్రిని హమాస్ దొంగిలించిందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) తెలిపింది.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.
గాజా పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం కావడంతో పలువురు నివాసితులు ఆసుపత్రులు మరియు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ భూ దాడులకు దిగుతుందన్న సమాచారంతో మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్షిప్లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో కనీసం 1.1 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించింది. గాజా నగర నివాసులను గాజా స్ట్రిప్ యొక్క దక్షిణ భాగంలోకి పారిపోవాలని ఆదేశించింది, హమాస్ మిలిటెంట్లు నగరం కింద సొరంగాలలో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ తరలింపు మీ భద్రత కోసమే నంటూ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.