Home / Afghanistan
కాబూల్లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 100 కు చేరింది. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు మరణించారు.
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్లోని తాలిబన్ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్ ఇచ్చింది.
అప్గనిస్తాన్లోని కాబూల్ సైనిక శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది.
ఆప్ఘనిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్లో రష్యా ఎంబసీ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు.
ఆఫ్గనిస్తాన్ హెరాత్లోని గుజార్గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది.
ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్ ప్రావిన్స్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్
తాలిబన్ మత గురువు రహీముల్లా హక్కానీ ఐసీస్ ఆత్మాహుతి దాడిలో మృతి చెందారు. ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మదర్సాలో ఆయనను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఇటీవల కాలంలో ఆయన బాలికలు స్కూళ్లకు వెళ్లి విద్యనభ్యసించవచ్చునని పలుమార్ల బహిరంగ మద్దతు ప్రకటించారు.
అప్గానిస్తాన్లో తాలిబన్లు పగ్గాలు చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రజల జీవితాలు మరింత దుర్భంగా మారిపోయాయి. మహిళలపై సరికొత్త ఆంక్షలు విధించడంతో ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. బాలికల చదువుపై ఆంక్షలు విధించడంతో పాటు స్కూళ్లను ధ్వంసం చేయడంతో చదువు