Last Updated:

West Bengal Panchayat Elections: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్వీప్ చేసింది, గ్రామీణ స్థానిక ప్రభుత్వంలోని మూడు అంచెల్లోనూ మెజారిటీ సాధించింది. 3,317 గ్రామ పంచాయతీల్లో 2,552, 232 పంచాయతీ సమితులు, 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. 212 గ్రామ పంచాయితీలు, 7 పంచాయితీ సమితుల్లో గెలుపొంది బీజేూపీ రెండవ స్థానంలో ఉంది. కొన్ని ఫలితాలు ఇంకా వెలువడవలసి ఉంది.

West Bengal Panchayat Elections:  పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం

West Bengal Panchayat Elections: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో  తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్వీప్ చేసింది, గ్రామీణ స్థానిక ప్రభుత్వంలోని మూడు అంచెల్లోనూ మెజారిటీ సాధించింది. 3,317 గ్రామ పంచాయతీల్లో 2,552, 232 పంచాయతీ సమితులు, 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. 212 గ్రామ పంచాయితీలు, 7 పంచాయితీ సమితుల్లో గెలుపొంది బీజేూపీ రెండవ స్థానంలో ఉంది.
కొన్ని ఫలితాలు ఇంకా వెలువడవలసి ఉంది.

పెద్ద ఎత్తున చెలరేగిన హింస..(West Bengal Panchayat Elections:)

గ్రామీణ బెంగాల్‌లో టిఎంసి పట్ల ప్రజల ప్రేమ, ఆప్యాయత మరియు మద్దతుకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజల గుండెల్లో టిఎంసి మాత్రమే నివసిస్తుందని ఈ ఎన్నికలు రుజువు చేశాయపి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ అధ్యక్షురాలు మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి పరీక్షగా పేర్కొనబడిన ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సోమవారం జరిగిన రీపోలింగ్‌లో పలు బూత్‌లలో మళ్లీ హింస చెలరేగింది. శనివారం నుంచి ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 40 మంది చనిపోయారు. ఎన్నికల అవకతవకలు, బూత్ కబ్జాలు, ఎన్నికల అక్రమాలు, ఓటరు అణిచివేతకు సంబంధించిన పలు నివేదికల నేపథ్యంలో 696 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు.

ప్రతిపక్ష పరిశీలకులను కౌంటింగ్ కేంద్రాల్లోకి రాకుండా చేయడం ద్వారా తృణమూల్ ఓట్లను కొల్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
కౌంటింగ్‌ ఏజెంట్లను, బీజేపీ, ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల అభ్యర్థులను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవడం ద్వారా టీఎంసీ గూండాలు దొంగతనానికి తెగబడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు.మరోవైపు ఎన్నికల హింసలో మరణించిన వారిలో 60 శాతం మంది తమ కార్యకర్తలు లేదా మద్దతుదారులని తృణమూల్ పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా నిరాధారమైన ప్రచారంతో కూడిన హానికరమైన ప్రచారం కూడా ఓటర్లను మభ్యపెట్టలేకపోయిందని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. ప్రతిపక్షాల నో ఓట్ టు మమతా’ ప్రచారాన్ని ‘ఇప్పుడు మమతాకు ఓటు వేయండి’గా మార్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు” అని ఆయన అన్నారు.హింస మరియు బ్యాలెట్ బాక్స్ ట్యాంపరింగ్ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోస్ హెచ్చరించారు.

.