Home / జాతీయం
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. గొడవపడిన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాస్తైన ప్రేమ ఉన్న వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం భార్య ఉరిపోసుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసింది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల పై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యవసానాలను చవిచూడాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వైమానిక దళం ఆద్వర్యంలో శ్రీనగర్ లో చేపట్టిన శౌర్య దివస్ కార్యక్రమంలో పాకిస్థాన్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రేప్ కేసులో శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం పెరోల్ పై బయట ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్పై ప్రస్తుతం తన దత్తపుత్రిక హనీప్రీత్కు ‘రుహానీ దీదీ’ అనే కొత్త పేరును ప్రకటించారు
కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉన్న కార్యాలయాల్లో పడి ఉన్న స్క్రాప్ ను రూ. 254 కోట్లకు విక్రయించి 37 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని క్లియర్ చేసింది.
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్ను దాఖలు చేయడం తప్పనిసరి. కాగా పన్ను కట్టడానికి ప్రభుత్వం ఒక గడువును నిర్ణయిస్తుంది. ఆ గడువులోగా పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపు గడువును పెంచింది.
కేరళలో ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు, పినరయి విజయన్ సర్కారు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్, సర్కారుకు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది.
అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్' రాకెట్ సంచలనం సృష్టించింది. మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ తన ఏడాది పదవీ కాలంలో 20 మందికి పైగా మహిళలను పోర్ట్ బ్లెయిర్ నివాసానికి తీసుకెళ్లారని, లైంగిక వేధింపులకు గురిచేసారని దీనికి బదులుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని విచారణలో వెల్లడయింది.
ఈ నెల 28,29 రెండు రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి, ఉగ్రవాద నిరోధక కమిటి ఛైర్మన్ చైర్ రుచిరా కాంబోజ్ తెలిపారు. ఈ సమావేశానికి యుకె విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
ఘజియాబాద్ లో మంగళవారం సాయంత్రం ఒక దాబావద్ద కారు పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో తలను పగులగొట్టి చంపాడు.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.