Home / జాతీయం
ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన ఢిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ భజన చేస్తుండగా.. ఏం జరిగింది అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల
భారతదేశం వెలుపల మొదటి ఐఐటి క్యాంపస్ టాంజానియాలోని జాంజిబార్లో వస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒక వ్యక్తి మూత్ర విసర్జన బాధితుడయిన గిరిజన కూలీ దశమత్ రావత్ ని కలిశారు. తన అధికారిక నివాసంలో అతడి పాదాలను కడిగారు.సిద్ధి జిల్లాలో కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లానుబుధవారం అరెస్ట్ చేసి అతడి ఆస్తిని బుల్డోజర్ తో కూల్చేసిన విషయం తెలిసిందే.
స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.
ముంబైలో తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అజిత్ పవార్ వర్గం, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (బిజెపి) ఎన్సిపిని అవినీతిమయం అన్నారు. మరి ఇప్పుడు ఎన్సీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే రిపీటయిందని శరద్ పవార్ అన్నారు.
శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,
అస్సాంలోని గువాహటిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలు రాని ఓ మూగ తల్లి, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాధితుల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు. మే 17న ఈ ఘటన జరగ్గా ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..