Last Updated:

Electricity bill: విద్యుత్ బిల్లు చెల్లించలేదని గేదెను పట్టుకెళ్లిన అధికారులు.. ఎక్కడో తెలుసా?

మధ్యప్రదేశ్‌లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్‌ల మోటర్‌బైక్‌లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.

Electricity bill: విద్యుత్ బిల్లు చెల్లించలేదని గేదెను పట్టుకెళ్లిన అధికారులు.. ఎక్కడో తెలుసా?

Electricity bill:మధ్యప్రదేశ్‌లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్‌ల మోటర్‌బైక్‌లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు గేదెను తీసుకెళ్లిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెండింగ్ బిల్లుల కోసం ఆస్తుల స్వాధీనం..(Electricity bill)

గ్వాలియర్ సివిక్ బాడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ సింగ్ సోలంకి మాట్లాడుతూ, చట్టం ప్రకారం, పెండింగ్ బిల్లులను తిరిగి పొందడానికి మేము విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవచ్చు. బాల కృష్ణ పాల్ ఇంట్లో, మాకు గేదె దొరికింది కాబట్టి మేము దానిని గ్యారెంటీగా స్వాధీనం చేసుకున్నాము. పెండింగ్‌లో ఉన్న బకాయిలను తిరిగి వసూలు చేసిన తర్వాత విడుదల చేస్తామని అన్నారు.సాగర్ జిల్లాలోని కిషన్‌పురా గ్రామంలో ఆకాష్ కుర్మి అనే వ్యక్తి గేదెకు వైద్యం చేయడానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్ మోటార్‌బైక్‌ను కుర్మికి చెందినదిగా భావించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, సాగర్, దామోహ్, ఛతర్‌పూర్, పన్నా, గ్వాలియర్ మరియు మొరెనా జిల్లాల్లోని వందలాది మంది గ్రామస్తుల మ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మధ్యప్రదేశ్ ఈస్టర్న్ ఏరియా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.518 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులను రికవరీ చేయడానికి డ్రైవ్‌ను ప్రారంభించింది.పలుచోట్ల బకాయిదారులు ఉన్న గ్రామాలకు పరిపాలన విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు పౌర అధికారి ఒకరు తెలిపారు.వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియాలో కూడా నోటీసులు అందించబడ్డాయి. రికవరీ ప్రక్రియలో, పెద్ద డిఫాల్టర్ల పేర్లు వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో అతికించబడ్డాయని సాగర్ బండా డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నామ్‌డియో తెలిపారు.అంతేకాకుండా, తన డివిజన్‌లో 41 గ్రామాలలో విద్యుత్తు డిస్‌కనెక్ట్ చేయబడిందని మరియు 1,700 మంది పెద్ద డిఫాల్టర్లు,సుమారు 300 మంది చిన్న డిఫాల్టర్ల బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లునామ్‌డియో చెప్పారు.

మరో వైపు విద్యుత్ శాఖ రికవరీ డ్రైవ్‌కు వ్యతిరేకంగా, వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసనలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి నిదానంగా వెళ్లాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విద్యుత్ సంస్థ అధికారులను కోరారు.