Home / తెలంగాణ
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
తెలంగాణాలో అనేక చోట్ల విద్యార్ధులు పుడ్ పాయిజన్ కు గురౌతున్నారు. పేదలను ఆదుకొంటున్నామంటున్న వారే చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టెడి అన్నం తినే ఆ నోటికాడ కూడులో కాసుల కక్కుర్తి విద్యార్ధుల గొంతు నొక్కేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందని ఆ పార్టీ సీనియర్, తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ పన్నుల రాబడిని పెంచడం పై దృష్టి సారించడం లేదని, గణాంకాల ప్రకారం ఛార్మినార్ జోన్ లో 50శాతం మాత్రమే పన్నులు వసూల కావడం పై భాజపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది.
తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.