Home / తెలంగాణ
సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు. మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. 2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
BRS meeting in Khammam: తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని.. ఆ పథకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ, పంజాజ్ లోనూ ఈ కార్యక్రమం చేపడుతామని ఆయన అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలపై కూడా కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. దేశం అభివృద్ధి చెందడం ఎలా.. రైతులకు, కార్మికులకు ఏం చేయాలనే అంశాలపై ముఖ్యనేతలందరం కలిసి […]
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన మనసుని ఎంతో కాలంగా ఓ అంశం కలిచివేస్తోందని చెప్పారు. ఆ అంశం ఏంటంటే.. రాజకీయాలు జరుగుతుంటయి ఎందరో గెలుస్తరు ఎందరో ఓడతారు.. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది.
Cm Kcr: కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నిపథ్ను రద్దు చేస్తామని.. కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభా వేదికగా మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకుంటే విదేశీ రుణాలపై ఆధారపడాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Cm Kcr )సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రాగానే.. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగంలోనే ఉంచాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో దళితబంధు […]
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో సీపీఐ జాతీయ నేత డి. రాజా కేంద్రం పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్లతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు. ప్రజల సౌకర్యం కోసం అన్నీ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు.
Akhilesh Yadav: భాజపా కు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ Akhilesh Yadav అన్నారు. కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. ఖమ్మం సభా వేదికగా అఖిలేష్ ప్రకటించారు. దేశంలో అరాచక పాలన సాగుతుందని.. ఆ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం వచ్చిందని అఖిలేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కాపీ కొడుతుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం కావాలనే […]
Social Media Influencers: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే వారి జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మెుదటి 30 మందిలో మంత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ (Minister Ktr) అరుదైన […]
యాద్రాద్రి లో పూజల అనంతరం సీఎం కేసీఆర్ ( CM KCR), జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. వారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు.
BRS Meeting: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఈ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. బహిరంగసభలో పాల్గొనేందుకు డిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ […]