Last Updated:

BRS Meeting: యాదాద్రిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, జాతీయ నేతలు

BRS Meeting: యాదాద్రిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, జాతీయ నేతలు

BRS Meeting: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది.

జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఈ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు.

బహిరంగసభలో పాల్గొనేందుకు డిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి బయలుదేరి వెళ్లారు.

గర్భాలయంలో ప్రత్యేక పూజలు

యాద్రాద్రికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్టతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.

వీవీఐపీల రాకతో ఆలయ పరిసరాల్లో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అనంతరం నేతలు ఖమ్మం సభకు బయలు దేరి వెళ్లారు.

గులాబీమయం

భారీ సభతో ఖమ్మం మొత్తం గులాబీమయమైంది. నగరం చుట్టూ దాదాపు 5 కిలో మీటర్ల వరకు గులాబీ తోరణాలు, హోర్డింగ్స్, భారీ కటౌట్స్, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఖమ్మం సభ(BRS Meeting)కు హాజరవుతున్నారు. మరో వైపు సభకు పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

బీఆర్ఎస్ సభ విశేషాలు

ఖమ్మం – వైరా రహదారిపై సుమారు 70 ఎకరాల్లో సభా ప్రాంగణం నిర్మించారు.

వేదికను జర్మనీ టెక్నాలజీ వాటర్ , ఫైర్ రూఫ్ లతో రూపొందించారు.

దాదాపు 5 లక్షల మంది జనాభా ఈ సభకు హాజరవుతారని అంచనా.

ఈ వేదికపై ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మూన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి. రాజా ఉండనున్నారు.

వీరితో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర మంత్రులు కూడా ఉండనున్నారు.

మిగిలిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు.

నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రాంగణంలో 50 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.

మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సమారు 75 వేలకు పైగా కుర్చీలను సిద్ధం చేశారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/