Home / ప్రాంతీయం
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.
జరగ బోయే కురుక్షేత్ర యుద్ధం లో ధర్మం గెలవాలని చంద్ర బాబు అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని విమర్శించారు.
మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.
తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు.
హైదరాబాద్ విద్యార్థి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాలోని షికాగో వెళ్లాడు. వారం రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీనితో 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకంది కోసం షికాగో పోలీసులు, ఇండియన్ కౌన్సేలేట్ కార్యాలయం సిబ్బంది కూడా ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే . ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
ఈ సారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. భువనగిరి లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్తి బూరనర్సయ్య గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.
ఎంపీగా అవినాష్రెడ్డి విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు షర్మిల . హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ముస్లిం రిజర్వేషన్లపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. ఆరు నూరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు .
వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వారాహి విజయ భేరి సభలో సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.