Home / ప్రాంతీయం
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు సమీకరించాలని అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మధురానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రహ్మత్ నగర్లోని బంగారు మైసమ్మగుడివద్ద ఉంటున్న శ్రీనాథ్.. పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉన్న ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
ఏపీలో బెట్టింగ్ జోరు అందుకుంది .ఒక వైపు ఐపీఎల్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి .తాజాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు ఊపు అందుకున్నాయి .సహజంగా అగ్రనేతలు పోటీ చేసే చోట్ల బెట్టింగులు ఉంటాయి .కానీ ఈ సారి అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో బెట్టింగులు జరగడంలేదు
ఒకప్పుడు అల్లర్లు అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో అంతకుమించి విధ్వంసంకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగినా తగ్గట్లేదు.
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.గత కొంతకాలంగా ధియేటర్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో వారికి ఆర్దిక ఇబ్బందులు తలెత్తడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. పరిస్దితుల్లో మార్పు వస్తే మరలా షోలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు -చిలకలూరిపేట హైవేపై.. టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో.. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన జరిగింది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు.. సుత్తి, రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్మ్యాన్కు గాయాలయ్యాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.
నగరాల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా విద్యాధికులు వుంటారు .ఉద్యోగాలు ,వ్యాపారాలు ,చేతిపనులు చేసుకునే వారు అధికం .అయితే పోలింగ్ రోజు మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారు .ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తంతు జరుగుతుంది.దీనితో నగర వాసులకన్నా గ్రామీణ ప్రాంత వాసులకే ఎక్కువగా రాజకీయ చైతన్యం ఉన్నట్లు తెలుస్తోంది.