Home / ప్రాంతీయం
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ప్రకటించింది. దీనితో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) చరిత్రలో తొలిసారిగా 27 మంది చివరి సంవత్సరం లా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్లో చేరేందుకు అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు.
అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తూ అమరావతి రైతులు చేపట్టిన రెండవ విడుత మహా పాదయాత్ర అనుమతి లేదన్న డిజిపి ఆర్డర్స్ ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. పరిమితి ఆంక్షలతో పాదయాత్ర చేపట్టవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన కేసులో ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరంటూ కేసును ధర్మాసనం కొట్టేసింది.
ఆసియా కప్-2022లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. ఇండియా ఆఫ్గానిస్తాన్ కు మధ్య గురువారం జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించారు. దీనికి గానూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కోహ్లీని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
పూజ్య బాపూజీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడవగలిగే స్వాతంత్య్రమే నా ఆకాంక్ష అన్న మాటలు. అర్ధరాత్రి ఆర్డర్స్ కు పోలికెక్కడో తెలియటం లేదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోొ సాక్షాత్తు ప్రధాని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వేలాది మంది రైతాంగం,
ట్విట్టర్ లో తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో అధికారం వారికి ఇష్టారాజ్యంగా మారింది. అసెంబ్లీ, ప్రజా వేదికలు వారికి సొంత నిలయాలుగా మారాయి. మాటలు తూలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున