Home / ప్రాంతీయం
హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది.
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నేత కే. కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఈ మేరకు లేఖను మీడియా ముందుంచారు. తన సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియచేసివున్నట్లు ఆయన తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న శివ శంకర రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు సరైనవిగా తమకు కనిపించడం లేదని న్యాయస్ధానం పేర్కొనింది
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రమేయంతోనే హుజూరాబాద్ పురపాలక సంఘంలో రెండు కోట్ల మేర అవినీతి చోటుచేసుకొందని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ తరచుగా చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే మామకు వెన్నుపోటు పొడిచాడు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వెన్నుపోటు విమర్శల పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.