Home / క్రైమ్
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోబోతున్న టీనేజ్ అమ్మాయి తలనరికి .. తలను తీసుకొని పారిపోయిన అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 16 ఏళ్ల మీనా అనే టీనేజ్ బాలికను 32 ఏళ్ల వ్యక్తి గురువారం నాడు వివాహం చేసుకోవాల్సింది. అయితే అధికారులు వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి నిలిపివేయించారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన జరిగింది .
ఆయనొక ప్రజా ప్రతినిధి.. మాజీ మంత్రి కూడా.. అయితే ఏం లాభం...సొంత భార్యను కొట్టి కొట్టి చంపాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన కజకిస్తాన్లో జరిగింది. గత ఏడాది నవంబర్లో తన భర్తకు చెందిన బంధువు రెస్టారెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కాగా ఆయన భార్య పేరు సాల్తానాట్ నుకెనోవా.
ఇటీవల కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన తాజాగా జరిగింది. వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన హైదరాబాద్ లోని, బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుంది. అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధవులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు. నాగార్జునను బంధువులు ఆమనగల్ వద్ద ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు.
బెంగళూరులో ఏఐ స్టార్టప్కు సీఈవోగా ఉన్న ఒక మహిళ, తన భర్తను కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిందని సోమవారం అరెస్టు చేశారు. గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గలో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్లో పోలీసులు పట్టుకున్నారు.
విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందగా.. కుసుమ అనే మరో తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు చెబుతున్నారు.
మామూలుగా అయితే ప్రేమకి, ఆపై పెళ్ళికి నిరాకరించిందని ప్రియురాలిపై పగ తీర్చుకునే ప్రియుళ్ళని చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మాజీ ప్రేమికుడి మీద పగ సాధించేందుకు ఓ యువతి అతడిని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.
తమిళనాడులో 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్నులింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆమె మాజీ క్లాస్మేట్ ఆమెను గొలుసుతో కట్టి, బ్లేడ్తో గాయపరిచి సజీవ దహనం చేసిందని పోలీసులు తెలిపారు.చెన్నైలోని కేలంబాక్కం సమీపంలోని తలంబూర్లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.