తెలంగాణ నూతన సచివాలయం “శాంతి సౌధం” ప్రత్యేకతలివే
తెలంగాణ నూతన సచివాలయం "శాంతి సౌధం" ప్రత్యేకతలివే specialties of Telangana New secretariat

చరిత్రలో నిలిచిపోయే రీతిలో.. దేశంలో ఎక్కడా లేనట్టుగా నిర్మితమైంది తెలంగాణ నూతన సచివాలయం.

ఇండో–పర్షియన్ నిర్మాణ శైలిలో చూడగానే తాజ్మహల్, మైసూర్ ప్యాలెస్ను తలపించే శ్వేతసౌధం.

మొత్తం 635 గదులు.. 30 కాన్ఫరెన్స్ హాల్స్.. 34 గుమ్మటాలు.. ఈ సచివాలయం ప్రత్యేకతలు.

హుస్సేన్సాగర్ తీరాన దాదాపు 26 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ భవనం

తెలంగాణ నూతన సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, అంటే ఇది ఇది కుతుబ్మినార్(239 అడుగులు) కంటే 26 అడుగులు ఎత్తు ఎక్కువ.

సచివాలయం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా.. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను నిర్మించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి చాంబర్

సచివాలయం లోపల ఉన్న సువిశాలమై కారిడార్లు, కళాత్మకత ఉట్టిపడేలా నిర్మితమైన పిల్లర్లు.

ముఖ్యమంత్రి కోసం వచ్చిన ప్రజలు.. ఆయనను కలిసేందుకు ఏర్పాటు చేసిన జనహిత మందిరం.

సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు, అక్కడి ఉద్యోగుల పిల్లలకు క్రెచ్, ఆరోగ్య కేంద్రం, బ్యాంకు, ఏటీఎం వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి
