Last Updated:

Hathras Stampede: ఉత్తరప్రదేశ్: హత్రాస్ అధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 80 మందికి పైగా మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 80 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్ మరియు పొరుగున ఉన్న ఎటా జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు

Hathras Stampede: ఉత్తరప్రదేశ్: హత్రాస్ అధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 80 మందికి పైగా మృతి

Hathras Stampede: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 80 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్ మరియు పొరుగున ఉన్న ఎటా జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ తన జిల్లాలో దాదాపు 60 మంది మరణించినట్లు ధృవీకరించగా, ఎటా అధికారులు మరో 27 మరణాలు అక్కడి ఆసుపత్రుల నుండి నమోదయ్యాయని తెలిపారు.

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం..(Hathras Stampede)

హత్రాస్‌లో శివునికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ముగిసే సందర్బంలో తొక్కిసలాట జరిగింది, దీని ఫలితంగా మహిళలు, పిల్లలు సహా 80 మందికి పైగా మరణించారు. మానవ్ మంగళ్ మిలన్ సద్భావనా ​​సమాగం కమిటీ ఆధ్వర్యంలో ఈ సత్సంగం జరిగింది.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోం అడిషనల్ చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్‌ను ఈ ఘటనకు సంబంధించి నివేదిక కోరారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి మరియు గాయపడిన వారికి చికిత్స కోసం ఏర్పాట్లను నిర్ధారించడానికి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలని సీనియర్ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: