Home / Pawan Kalyan
ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.
జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామనని వ్యాఖ్యానించారు. యువత తమ భవిష్యత్తు కోసం నన్ను నమ్మంది నాపై నమ్మకం ఉంచండి అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం రోడ్డే వెయ్యని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుందంటూ ఆయన అధికార వైసీపీపై మండిపడ్డాడు.
ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?
విశాఖ ఋషికొండ బీచ్ కు చేరుకొని నడక సాగిస్తూ ఋషికొండ లో తవ్విన కొండను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు.రిషికొండ ను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా శనివారం సాయంత్రం రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు నేడు విశాఖలోని నోవాటెల్ కి వెళ్లి అక్కడ జనసేనానికి కలిశారు. దీనితో పవన్ తో గంటా చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ఇద్దరు నేతలు స్పందించలేదు. కానీ ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఏక్షణం ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి గంటా జనసేనానితో చేతులు కలిపితే ఉత్తరాంధ్రలో వైసీపీకి చుక్కలు తప్పవు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా భేటీ కానున్నారు.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.