Home / national
Centre has finalized the EPF interest Rate 8.25 Percent: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్నిరోజుల కింద ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే వడ్డీని చెల్లించిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై […]
Man Arrested for Spying Pakistan: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ వ్యక్తి పాక్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుజరాత్లోని కచ్లో ఈ ఘటన జరిగింది. సహ్దేవ్ సింగ్ గోహిల్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ […]
Gautam Gambhir reacts on Rohit and Virat Kohli’s Retirement: టీంమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ లేకుండా భారత్ జట్టు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తొలిసారిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. కొత్తతరం వస్తుందనే నమ్మకం ఉంది.. టెస్టుల్లో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమైన […]
Preity Zinta has Moved to Court on PKBS Team: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టుకెక్కింది. జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్లోని పంజాబ్ జట్టు ఈ కంపెనీదే. ఏప్రిల్ […]
1 Maoist Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాల మీదకు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. […]
Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్కు గుడ్న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కేంద్రమంత్రి గురువార ఒక ప్రకటన చేశారు. ఈ-డ్రైవ్ పథకం కింద బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ-బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 11వేల ఈ-బస్సులను ఐదు నగరాలకు కేటాయిస్తామన్నారు. బెంగళూరుకు […]
Rahul Gandhi visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై రాహుల్ చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ డీయూఎస్యూ అధ్యక్షుడి కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి విద్యార్థులు హాజరై తమ సమస్యలను […]
CBI charges former Jammu and Kashmir Governor: జమ్మూకశ్మీర్లో ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసుకు సంబంధించి గతంలో ఆయన ఇండ్లల్లో సీబీఐ సోదాలు జరిపింది. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది. రూ.2,200 వేల కోట్ల అవినీతి.. కిష్త్వార్లో రూ.2,200 వేల కోట్ల విలువైన కిరు […]
Waqf Act cannot be suspended- Central Govt. said to Supreme Court: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతోపాటు కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ […]
DK Shivakumar visits Home Minister G. Parameshwara’s house: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన సంగతి విధితమే. పరిణామాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు, మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై డీకే మాట్లాడారు. నటి రన్యారావుకి మంత్రి పెళ్లి కానుక ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. […]