Home / Latest News
ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
ఇరాన్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో రోడ్డెక్కారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది మృతి చెందారు.
కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి సోకుతుందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న ఈ వైరస్కు ఖోస్టా-2గా నామకరణం చేశారు.
ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. అచే ప్రావిన్స్లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతుంది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు
ప్రపంచ క్రికెట్లో పాక్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్లను ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ లో పాక్ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం డీలాపడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ఓటమికి రెండో మ్యాచ్ తో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా బాబర్-రిజ్వాన్ ల జోడీ తిరగరాసింది.
అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్. కాగా ఈ ఏడాది ‘వలిమై’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే అదే జోష్తో వరుసగా సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు ఈ తమిళ నటుడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరోకి సంబంధించిన సినిమా నుంచి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.