Home / latest national news
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో (గతంలో ట్విట్టర్) తన బయోని "డిస్' క్వాలిఫైడ్ MP నుండి పార్లమెంటు సభ్యునిగా మార్చారు. లోక్సభ సెక్రటేరియట్ ఈరోజు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత గాంధీ తన ట్విట్టర్ బయోని మార్చారు.
ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన జంట బొమ్మన్, బెల్లీ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ నుండి రూ. 2 కోట్ల మేరకు లీగల్ నోటీసు జారీ చేసారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో తమకు ఇల్లు, మల్టీ పర్పస్ వాహనం, వన్ టైమ్ పేమెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు ఈ నోటీసులో ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును తగ్గించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. దీనివల్ల యువతకు ప్రజాస్వామ్యంలో నిమగ్నమయ్యేందుకు సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.
మోదీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది గంటలకే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి విందులోపాల్గొన్నారు. ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఈ విందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు.
శుక్రవారం అర్థరాత్రి మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తాజా హింసాత్మక సంఘటనలలో కనీసం ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారు.తాజా హింసాకాండలో, కుకీ వర్గానికి చెందిన ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా ప్రాంతంలో కుకీ వర్గానికి మరియు భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. మణిపూర్ పోలీసులు, కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు.
'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విధించిన శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు పెద్ద రిలీఫ్ ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో రీ ఎంట్రీకి మార్గం సుగమమైంది.
హర్యానాలోని నుహ్లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో 'బుల్డోజర్ చర్య' ప్రారంభించింది.నుహ్కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం కూల్చివేసింది.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్షకి గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దొరికింది. సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.