Last Updated:

The Elephant Whisperers: ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ డైరక్టర్ కు లీగల్ నోటీసు పంపిన బొమ్మన్, బెల్లీ జంట.. ఎందుకో తెలుసా?

ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన జంట బొమ్మన్, బెల్లీ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ నుండి రూ. 2 కోట్ల మేరకు లీగల్ నోటీసు జారీ చేసారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో తమకు ఇల్లు, మల్టీ పర్పస్ వాహనం, వన్ టైమ్ పేమెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు ఈ నోటీసులో ఆరోపించారు.

The Elephant Whisperers:  ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ డైరక్టర్ కు లీగల్ నోటీసు పంపిన  బొమ్మన్, బెల్లీ  జంట.. ఎందుకో తెలుసా?

The Elephant Whisperers: ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన జంట బొమ్మన్, బెల్లీ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ నుండి రూ. 2 కోట్ల మేరకు లీగల్ నోటీసు జారీ చేసారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో తమకు ఇల్లు, మల్టీ పర్పస్ వాహనం, వన్ టైమ్ పేమెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు ఈ నోటీసులో  ఆరోపించారు.ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు తమను రియల్ హీరోలుగా పరిచయం చేసి విస్తృత ప్రచారం కల్పించారు. కాని తమిళనాడు ముఖ్యమంత్రి మరియు భారత ప్రధానమంత్రి మాత్రమే తమకు ఆర్దికసాయం అందించారని వారు నోటీసులో పేర్కొన్నారు.

ఫోన్ తీయడం లేదు..(The Elephant Whisperers)

చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త, వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రవీణ్ రాజ్, ఈ జంట తనకు దాదాపు దశాబ్దకాలంగా తెలుసునని, ఈ జంట తనను సంప్రదించినప్పుడు చెన్నైలోని ఒక న్యాయవాద సంస్థతో తాను వారిని సంప్రదించానని చెప్పాడు. బొమ్మన్ మరియు బెల్లీ ఇద్దరూ గొన్సాల్వేస్ పట్ల నిరాశ చెందారు. ఆమె డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు వారికి డబ్బు సహాయంతో పాటు బెల్లీ మనవరాలి చదువుకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆమె ఇప్పుడు ఆ సినిమా ద్వారా వచ్చిన అపారమైన లాభాల్లో కొంత భాగాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరిస్తోందని రాజ్ అన్నారు.బొమ్మన్ కాల్ చేస్తే గోన్సాల్వ్స్ ఫోన్ తీయడం లేదని చెప్పారు.ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది మహమ్మద్ మన్సూర్ నాలుగు రోజుల క్రితం గోన్సాల్వేస్ తరపున సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి తనకు రిప్లై నోటీసు అందిందని చెప్పారు. అందులో, ఆమె ఇప్పటికే ఈ జంటకు డబ్బు ఇచ్చిందని పేర్కొంటూ మరింత సహాయం నిరాకరించిందని చెప్పారు. నా క్లయింట్‌తో సంప్రదించిన తర్వాత రెండు రోజుల్లో నేను సమాధానం పంపుతాను అని మన్సూర్ చెప్పారు.

సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. ఏనుగుల సంరక్షణ, అటవీ శాఖ మరియు దాని మహోత్‌లు బొమ్మన్ మరియు బెల్లీ యొక్క విపరీతమైన కృషిని హైలైట్ చేయడమే ఎలిఫెంట్ విస్పరర్స్’ని రూపొందించడంలో లక్ష్యం.ఇది మావటిలు, మరియు సహాయకుల గురించి ఒక అవగాహన కలిగించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ రాష్ట్రంలోని ఏనుగులను చూసుకునే 91 మంది మావటిలు మరియు సహాయకులకు గృహాలను నిర్మించడానికి మరియు అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఏనుగుల శిబిరాన్ని అభివృద్ధి చేయడానికి విరాళాలు ఇచ్చారు.అకాడమీ అవార్డు అనేది బొమ్మన్ మరియు బెల్లీ వంటి మావటిల పనికి విస్తృతమైన గుర్తింపును తెచ్చింది.ఈ కథనానికి సహకరించిన వారందరిపై మాకు లోతైన గౌరవం ఉంది. సానుకూల మార్పును సృష్టించాలనే కోరికతో మేము కొనసాగుతామని పేర్కొంది.