Home / పొలిటికల్ వార్తలు
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. ఆయనతోపాటు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ భాగలక్ష్మీతో సహా మంత్రి కేటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి కేటిఆర్ వారిని ఆహ్వానించారు.
యావత్ దేశ ప్రజానికం ఇప్పుడు తెలంగాణవైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నేడు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు హైదరాబాద్ చేరుకుని కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుతున్నారు.
Munugode:మునుగోడులో ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్న రాజకీయ పార్టీలు
హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో రెచ్చిపోతున్నారు. అధికార, విపక్ష నాయకులను ఏకిపారేస్తున్నారు.
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఇటీవల జరిగిన సమీక్షలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి సీఎం జగన్ సీనియర్లకు షాక్ తినిపించారు
మునుగోడు ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు భాజపా విజ్నప్తి చేసింది. హైదరాబాద్ బుద్ధభవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.