Home / పొలిటికల్ వార్తలు
కర్నాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై బయోపిక్ తీసేందుకు రంగం సిద్దమైంది. టైటిల్ రోల్ లో నటించేందుకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్ జోడో’గా అభివర్ణించారు.
2024లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతారంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు
పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా. ? అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వైసీపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గృహనిర్బంధం చేశారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.