Home / పొలిటికల్ వార్తలు
MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షం మజ్లిస్ అభ్యర్ధన మేరకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది.
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
శివరాత్రి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పండుగ వేళ వైసీపీ చేసిన ఓ ట్వీట్ పొలిటికల్గా హీట్ పుట్టిస్తోంది. అది వైసీపీ, బీజేపీ మధ్య ట్వీట్ వార్కు దారితీసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Kanna Laxmi Narayana: కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ సీనియర్ నేత తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత.. చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.