Home / జాతీయం
గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలోరాజ్కోట్కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్టాప్లోని ముఖ్యమైన ఫైల్స్ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
డేటా సెంటర్ వ్యాపారంలో భాగంగా యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్లో రూ.39వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని కంపెనీ కో ఫౌండర్, హిరానందానీ గ్రూపు చైర్మన్ దర్శన్ హిరానందాని పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
అత్యాచారం కేసుల్లో రెండు వేళ్ల పరీక్ష ను నిషేధించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
అనుకూలంగా ఉంటే సరి, లేదంటూ రాజ్యంగ పదవిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను ఓ ఆటాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై విసిగిపోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ గిరి వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొల్లుమంటున్న తరుణంలో తాజాగా గవర్నర్ గారు మీరు పదవి నుండి తప్పుకోండంటూ తమిళనాడు అధికార ప్రభుత్వం డిఎంకే కూటమి డిమాండ్ చేసింది.
గుజరాత్లో మోర్బీలో ఆదివారం నాడు 170ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేష జనాదరణ పొందుతుంది. తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. జడ్చర్ల నుంచి పాదయాత్ర ద్వారా షాద్ నగర్ చేరుకున్న రాహుల్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.