Last Updated:

Amit Shah: 13 సార్లు కెరీర్ ప్రారంభించి 13 సార్లు ఫెయిల్ .. రాహుల్ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

Amit Shah: 13 సార్లు కెరీర్ ప్రారంభించి 13 సార్లు ఫెయిల్ .. రాహుల్ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

Amit Shah: కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇందులో ఒక సందర్భం తాను చూశానని, ఆ వ్యక్తి బుందేల్‌ఖండ్‌కు చెందిన కవిత అనే పేద మహిళను కలుసుకున్నారని, అయితే ఆమెకు చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వమే ఆమెకు ఇల్లు, రేషన్, విద్యుత్ సౌకర్యం కల్పించిందని చెప్పారు.

మోదీ రోజుకు 17 గంటలు పనిచేస్తున్నారు..(Amit Shah)

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఒక్క సరైన అంశం కూడా లేదని ఇంతవరకూ జరిగిన చర్చతో రుజువైందన్నారు. ప్రధానిపై కానీ ప్రభుత్వంపై కానీ అసలు అవిశ్వాసమన్నదే లేదని, లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక భ్రమను సృష్టించేందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చారని విపక్షాలను విమర్శించారు. దేశ ప్రజలు, పార్లమెంటుకు నరేంద్ర మోదీపై పరిపూర్ణ విశ్వాసం ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ మంది ప్రజల అభిమానాన్ని చూరకొన్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాత్రమేనని అమిత్‌ షా చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ అని, దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 17 గంటలు పనిచేస్తున్నారని ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని కేంద్ర అమిత్ షా అన్నారు.

దేశంలో ప్రధానిపై, ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం లేదు.. కేవలం భ్రమ కల్పించడానికే ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని అమిత్ షా అన్నారు.స్వాతంత్ర్యం తరువాత, చాలా మంది ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రధాని మోదీ ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. అతను రోజుకు 17 గంటల పాటు నిరంతరం పని చేస్తాడు. ఒక్క సెలవు కూడా తీసుకోకుండా.. ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని అమిత్ షా తెలిపారు.మోదీ ప్రభుత్వం కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాజవంశాలను అంతం చేసింది. యూపీఏ పాత్ర అధికారాన్ని కాపాడుకోవడం. కాని ఎన్ డి ఏ ప్రజలను రక్షించడం కోసం పోరాడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.