Home / తెలంగాణ
తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు. ఆరోగ్యం బాగలేదంటూ అక్కడే తిష్టవేసి పాలన పేరుతో ప్రజాధనాన్ని కేసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ బ్రాండ్, భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
పెదపల్లి జిల్లా విషాదం చోటు చేసుకొనింది. ఎలిగేడు మండలం సూల్తాన్ పూర్ లో విద్యుత్ షాక్ కు గురై దంపతులు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
మునుగోడు బైపోల్ సందర్భంగా రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పైకి పథకాలు వాగ్ధానాలు అంటూనే మరోవైపు ప్రజలకు ఓటుకు నోటు ఆశచూపుతారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి.
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
చినుకు పడితే చిత్తడి చిత్తడిగా ప్రధాన రహదారులు, పొంగి పొర్లే మురికి నాలాలు, ఎటు చూసిన బురదమయం, అంతకుమించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నాలాలు. ఇది భాగ్యనగరంలో నిత్యం చోటు చేసుకొనే తంతు.
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.