Home / ప్రాంతీయం
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కాంగ్రెస్పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అమిత్రెడ్డి కలిశారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఎంఐఎంకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బీజేపీ కె మాధవీలతను బరిలో నిలిపింది. హైదరాబాద్లోని అతి పెద్ద ఆస్పత్రి విరంచికి ఆమె డైరెక్టర్.. తన ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తి రూ.221 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆమె పాత బస్తీలోని పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉచితంగా వైద్య సేవలందించారు
దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 లో రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని అన్నారు .
: సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం . మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెడుతున్నానని అని తెలిపారు .
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు.. కూటమికి చెందిన పలువురు నేతలకు పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమన్న చందంగా మాటలు తూటాల్లో పేలుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికి వైసీపీ నేతవంగా గీత కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో పింఛన్ల ఇంటింటి పంపిణీకి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని తాజాగా ఈసీ ఆదేశించడం జరిగింది . ఫస్ట్ తారీకు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పింఛన్ దారులలో టెన్షన్ మొదలవుతుంది .ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గత నెలలో ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణి చేయడం కుదరలేదు .సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది .
ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు
కోనసీమలో కొబ్బరి బొండం లో ఎంత తీపిగా ఉంటుందో రాజోలు నా జీవితంలో అంతటిది .రాష్ట్రము అంతా ఓడిపోయినా రాజోలు లో గెలిచి ఒక చిన్న వెలుగు నింపిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ..ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజోలు లో పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చీకటిలో వెలుగు లాగా రాజోలు జనసేనకు విజయం అందించింది .