Home / ప్రాంతీయం
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. . చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బావమరిది రామకృష్ణ తదితరులు చంద్రబాబును కలిసారు. జైలులో చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్యంపై ఆరా తీసారు. దాదాపు 40 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు.
సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ విషయంలో ఊహించని షాక్ తగిలింది. జ్యుడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో
ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో "శ్రీకాంత్ అయ్యంగార్" కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ శిష్యులలో ఒకరైన ఈయన.. వర్మ తెరకెక్కించిన సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా
విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో
ఎన్ని కేసులు పెట్టినా సరే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఎవడికీ భయపడేది లేదని ప్రముఖ హీరో, తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల కోసం టీడీపీ తరఫున చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు
అస్సాం వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్ కోర్ట్ వద్ద ఆగి మోమొలు తిన్నారు. స్ట్రీట్ ఫుడ్ ఎవరు వద్దంటారు అందులోనూ మోమొస్ లాంటి ప్రత్యేకమైన పదార్థాలు తినకుండా ఎలా ఉంటామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పని దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు అధికారం అంటే ఏమిటో తెలియదన్నారు.
ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెరుగు అడిగినందుకే దాడి చేస్తారా అంటూ ఆ హోటల్ ను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.