Home / ప్రాంతీయం
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో పోటీదారులందరిలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. రాజగోపాల్రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అధికారుల ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు, తన భార్య లక్ష్మికి రూ.458.37 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె పక్కన సోదరుడు తప్ప మరెవరూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయకుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంతకన్నా లేరు.
మంత్రి కేటీఆర్ మైనార్టీలతో తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, భాజపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయన మంత్రి కేటీఆర్ అన్నారు.
ఏలూరు జిల్లా లోని పోలవరం లోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. కాగా వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాల చేత గత 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తుంది. అయితే ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. నేటి విచారణకి అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు ప్రత్యేక పిపి వివేకానంద తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జోరుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు కొన్ని పార్టీలు పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే నేటితో నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇక అభ్యర్ధుల లాస్ట్ లిస్ట్ భారతీయ జనతా పార్టీ తాజాగా ప్రకటించింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద లో మైనార్టీ డిక్లరేషన్ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూటీ పై నలుగురు వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ సమయంలోనే గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందిడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక మరొకరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు