Last Updated:

KTR: ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

KTR: ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్

Munugode: మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కేటీఆర్ గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు.

అంశాల స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, అంశాల స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసారు.

ఇవి కూడా చదవండి: