Last Updated:

Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్సర్ బారిన పడలేదు.. అలా రాయద్దొ- మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తనకు సంబంధించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో తాను క్యాన్సర్ బారిన పడినట్టు చిరంజీవి వెల్లడించడం షాక్ కకు గురి చేస్తోంది. అయితే ముందుగా గుర్తించుకోవడం వల్ల చికిత్స చేయించుకుని కోలుకున్నట్టు ఆయన చెప్పారు.

Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్సర్ బారిన పడలేదు.. అలా రాయద్దొ- మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌లేదని చెప్పుకొచ్చారు. ముందుగా అలర్ట్ అవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని మాత్రమే చెప్పానంటూ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

తప్పుడు ప్రచారం చెయ్యొద్దు

నానక్ రామ్ గూడలో ఓ హాస్పటిల్ లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా తనకు క్యాన్సర్ పై అవగాహణ కల్పించారు చిరంజీవి. తనకు క్యాన్సర్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. “కొద్ది సేపటి క్రితం  నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల  అవగాహన పెరగాల్సిన  అవసరం  గురించి  మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్  టెస్టులు   చేయించుకుంటే  క్యాన్సర్ రాకుండా  నివారించవచ్చు అని చెప్పాను. నేను  అలర్ట్  గా  వుండి  కొలోన్ స్కోప్  టెస్ట్  చేయించుకున్నాను. అందులో  non – cancerous polyps ని డిటెక్ట్ చేసి  తీసేశారు  అని  చెప్పాను.  ‘అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద  మారేదేమో’ అని  మాత్రమే  అన్నాను.  అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని  మాత్రమే  అన్నాను. అయితే  కొన్ని  మీడియా సంస్థలు  దీన్ని సరిగ్గా అర్థం  చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో  ‘నేను  క్యాన్సర్  బారిన పడ్డాను’ అని  ‘చికిత్స  వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది  వెల్ విషర్స్  నా ఆరోగ్యం గురించి  మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి  జర్నలిస్టులకి  ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు  చవాకులు  రాయకండి. దీనివల్ల  అనేక మందిని  భయభ్రాంతుల్ని  చేసి  బాధ పెట్టిన వారవుతారు.” అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చెప్పారు.

సినీ కార్మికులకు క్యాన్సర్  స్క్రీనింగ్ లు(Chiranjeevi)

జీనోమిక్స్ టెస్ట్ ద్వారా ముందస్తుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చని చిరంజీవి చెప్పారు. అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ లు టెస్టులు చేయిస్తానని, వారికోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రాల్లోనూ క్యాన్సర్ స్కీనింగ్ చేయాలని ఆసుపత్రులను కోరారు చిరంజీవి. క్యాన్సర్‌పై అవగాహన కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. కాగా చిరంజీవి గతంలో పలుమార్లు క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.