Published On:

EPFO Raises Auto-Settlement: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకునే అవకాశం!

EPFO Raises Auto-Settlement: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకునే అవకాశం!

EPFO Raises Auto-Settlement Limit For Advance Claims From Rs 1 Lakh To Rs 5 Lakh: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇక నుంచి రూ. 5 లక్షల వరకు వెంటనే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు ఉపసంహరణ కోసం సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. లక్షలాది మందికి భారీ ఉపశమనం కల్పిస్తూ అడ్వాన్స్ క్లెయిమ్స్​ కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ఈపీఎఫ్​వో రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది.

 

ముఖ్యంగా అత్యవసర సమయాల్లో త్వరగా నిధుల యాక్సెస్​ను సులభతరం చేస్తుంది. ఈపీఎఫ్​వో తాజా విధాన నిర్ణయం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఉద్యోగులకు వెంటనే ఆర్థిక సహాయం అందించేందుకు గతంలో కరోనా మహమ్మారి సమయంలో ఈపీఎఫ్ఓ మొదట అడ్వాన్స్ క్లెయిమ్​ల ఆటో-సెటిల్మెంట్​ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 

ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెరుగుదలతో సభ్యులు రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇదిలా ఉండగా, మొన్నటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకునేందుకు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం నిరీక్షించాల్సి ఉండేది. ఆ తర్వాత నాన్-ఆటో సెటిల్మెంట్​కు ఈపీఎఫ్​ఓ చందాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించి మాన్యువల్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టేంది. ఈ నేపథ్యంలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్​ఓ దీనిని సవరించింది.

 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ గత మార్చి నెలలో ASAC పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది. అంతకు ముందు ASAC పరిమితి రూ.50 వేలు ఉండగా, 2024 మేలో దాన్ని రూ. లక్షకు పెంచారు. FY24లో దాదాపు 9 మిలియన్ల మేర ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్​లు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 మిలియన్లకు చేరాయి.

ఇవి కూడా చదవండి: