Home /Author anantharao b
: తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన తన నిర్మాణంలో ఉన్న విల్లా మరియు తన కుటుంబ సభ్యుల ఇళ్లను తాకట్టు పెట్టినట్లు సమాచారం.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
రాజస్తాన్లో ప్రముఖ రాజ్పుత్ నాయకుడు,రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన్ చీఫ్ సుఖ్దేవ్సింగ్ గోగమెడిని గుర్తు తెలియని వ్యక్తులు జైపూర్లో ఆయన ఇంటి సమీపంలో కాల్చి చంపి పారిపోయారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు.
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా వరుసగా మూడవ సంవత్సరం అవతరించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ నేరాలు ఇక్కడ నమోదయ్యాయి.
2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.12 లక్షల కోట్లకు పైగా జిఎస్టి ఎగవేతకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 71 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను ఎగవేత మొత్తం మరియు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జారీ చేయబడిన షోకాజ్ నోటీసుల సంఖ్యపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
మిచౌంగ్ తుఫాను కారణంగా సంభవించిన వర్షాలకు చెన్నైలో ఎనిమిది మంది మరణించారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులుగా మారాయి, వాహనాలు కొట్టుకుపోవడంతో విద్యాసంస్థలను మూసి వేయాల్సి వచ్చింది.
థాయ్లాండ్లో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కనీసం 14 మంది మృతి చెందగా, 32 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.దేశంలోని పశ్చిమ ప్రావిన్స్లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్లో అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.
ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.
మిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.కోతకి వచ్చిన ఖరీఫ్ పంటని కాపాడుకోవడంమిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.