Home / ఆంధ్రప్రదేశ్
Nellore: నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగులో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు లోకసాని వెంగయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇటీవల పాఠశాలకు చెందిన విద్యార్థినిని నెల్లూరులోని లాడ్జికి తీసుకెళ్లినట్లు ఆరోపణ వచ్చాయి. విషయం తెలుసుకున్న స్థానికులు లాడ్జిలో ఉన్న విద్యార్థినిని గ్రామానికి తీసుకువచ్చారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు వెంగయ్యను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. మీ పిల్లల్ని తీసుకెళ్లలేదు కదా సంతోషించండి… అంటూ వెంగయ్య హేళనగా మాట్లాడాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు ఉపాధ్యయుడికి దేహశుద్ధి […]
Pawan kalyan : ఏపీ, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్, రామచందర్ రావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న మాధవ్.. శాసన మండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై, యువత, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను చట్టసభలో ప్రస్తావించారన్నారు. జాతీయవాద దృక్పథం కలిగిన నాయకుడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్.. కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా […]
AP Government Decision: గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 1659 మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ (ఏ)లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచింది. జూనియర్ అధ్యాపకులు, పీడీ(సి), గ్రంథాయన్లు, పీజీటీల జీతాన్ని రూ.24,150, టీజీటీ పీడీ (ఎస్) జీతాలు రూ.19,350, పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది జీతం రూ.16,300కి పెంచింది. కేటగిరీ (బీ)లోని పాఠశాలలు, కాలేజ్ […]
Guntur: స్కూలుకు వెళ్లాల్సిన బుడ్డోడు… పుస్తకాల బ్యాగ్తో కలెక్టరేట్లో ప్రత్యేక్షమయ్యాడు. తన ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక ఏకంగా జిల్లా అధికారికే చెప్పాలని డిసైడ్ అయ్యాడు.. ఆలస్యం కాకుండా తన మెదడులో పుట్టిన ఆలోచనను అమలు చేశాడు. వచ్చిరాని అక్షరాలతో… ఫార్మాట్ ఎంటో తెలియకుండానే ఓ వినతి పత్రం రాసేశాడు. ఆ పిర్యాదును కలెక్టర్కు ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ ఆసక్తికరమైన సన్నివేశం గుంటూరు కలెక్టరేట్లో ఆవిష్కృతమైంది. తమ పరిస్థితిని అర్ధం చేసుకుని న్యాయం చేయాల్సిందే.. […]
AP CM Chandrababu: ప్రతినెలా 1వ తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లు ప్రధాన కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు డప్పు కొట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ […]
YS Jagan Singaiah death case: మాజీ సీఎం జగన్కు హైకోర్టులో ఊరట లభించింది. దళితుడు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఘటన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల […]
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేడు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతరం గ్రామసభలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉండవల్లి నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి మలకపల్లి వెళ్లాల్సి ఉంది. కానీ ఉండవల్లి నుంచి బయల్దేరిన వెంటనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం […]
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన తాళ్లపూడి మండలంలోని మలకపల్లి గ్రామాన్ని సందర్శించి, NTR భరోసా పథకం కింద పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు రూపంలో పెన్షన్లు అందచేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పుగోదావరి పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు అదే రాత్రి తన స్వగ్రామమైన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలానికి బయలుదేరతారు. అక్కడ కడపల్లెలోని తన […]
4th Class student files Complaint with Collector: సాధారణంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తుంటారు. కలెక్టర్ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారమయ్యే సమస్యలు ఉంటే, కొన్ని సమయం తీసుకునే సమస్యలు ఉంటాయి. ఇవాళ గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్లో ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యాడు. పాఠశాల బ్యాగ్ వేసుకునని చేతిలో ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్కు వచ్చాడు. బాలుడిని చూసి అంతా […]
AP Government Cancels ArrowInfra Pumped Storage Hydroelectric Project: ఏపీలోని నంద్యాల జిల్లాలో అరోఇన్ఫ్రా పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు నిర్మాణ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్ పూర్తి చేయడంలో జాప్యం దృష్ట్యా కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు సత్యసాయి జిల్లాలో 83 మెగావాట్ల విండ్ […]