CM Chandrababu: రేపు తూర్పుగోదావరి పర్యటనకు సీఎం చంద్రబాబు

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన తాళ్లపూడి మండలంలోని మలకపల్లి గ్రామాన్ని సందర్శించి, NTR భరోసా పథకం కింద పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు రూపంలో పెన్షన్లు అందచేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తూర్పుగోదావరి పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు అదే రాత్రి తన స్వగ్రామమైన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలానికి బయలుదేరతారు. అక్కడ కడపల్లెలోని తన సొంతింటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఆయన సాధికార సమితి సభ్యుల కుటుంబాలను కలుసుకుని, వారి సమస్యలు విని, పరిష్కారాలపై చర్చిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలు ప్రభుత్వ పథకాల పర్యవేక్షనకే కాకుండా, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలుపుకునే దిశగా జరుగుతున్నాయి.