Home / Telangana
Minister Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై మంత్రి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మంత్రి చిట్చాట్ నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇంకా ఏమి ప్రయత్నాలు చేయాలో చేస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. […]
Telangana: తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణానికి హాని చేయొద్దని పిలుపునిచ్చారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్ తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన పోస్టర్లను తెలంగాణ పీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి, పలువురు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. […]
Telangana: ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే కేబినెట్ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీవ్ యువవికాసం, వానాకాలంలో సాగుచేసే పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, […]
Jupally Krishna Rao fires on KTR and Harish Rao : ప్రపంచ సుందరీమణుల పోటీలకు చాలా దేశాలతో పోటి పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పోటీల నిర్వహణతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మంగళవారం జూపల్లి సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడారు. ప్రపంచ సుందరీమణుల పోటీలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ సుందరీమణుల పోటీల ద్వారా తెలంగాణ […]
Bhatti Vikramarka participated in the revenue conference : రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మనుషులకు […]
Telangana: దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. భారీ వర్షాలు పడతాయి. ఇక రోళ్లు పగిలేలా ఎండలు కాచే రోహిణీకార్తెలో ఈ ఏడాది వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెప్పిన మాటలన్నీ ఉత్తవే అయ్యాయి. తెలంగాణతో పాటు దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే నెలలోనే నైరుతి రుతుపవానాలు ప్రవేశించాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావమా, లేక బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావమో తెలయదు […]
Bhu Bharati Act Implemented from Today Across Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతీ జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. […]
Congress Leader Madhuyashki Sensational Comments on MLC Kavitha: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా చిట్ చాట్లో మాట్లాడారు. కవిత లేడీ మాఫియా డాన్ అని, కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత చేయని దందా, స్కాం లేదని విమర్శించారు. బతుకమ్మ పేరుతో కవిత బతుకనేర్చిందని, కేసుల నుంచి బయట పడాలంటే కవితకి బీజేపీ […]
Former MP Harish Rao Open Challenge to cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పోలీస్, అధికారులను హెచ్చరించారు. కార్యకర్తలను వేధిస్తే రెడ్బుక్లో పేర్లు రాస్తామన్నారు. బడా కాంట్రాక్టర్లకు రూ.12వేల కోట్లు కట్టబెట్టారన్నారు. మిల్లా మ్యాగీతో అసభ్యంగా ప్రవర్తించారని ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్పై ఆరోపణలు వస్తున్నాయన్నారు. సీసీఫుటేజీ విడుదల […]
CM Revanth Reddy Speech at Telangana Formation Day Celebrations: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో పోలీసు కవాతు తర్వాత సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు అన్నారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. దశాబ్ధాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. […]