Home / Telangana
7 New Navodaya Schools starts in Telangana: తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో నవోదయా పాఠశాలు ఏర్పాటు కానున్నాయి. కాగా ఈ విద్యాసంవత్సరం నుంచే ఆయా స్కూళ్లలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూలై 14 నుంచి క్లాసులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. కొత్తగా నవోదయా స్కూళ్లు మంజూరైన కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. […]
Mahesh Kumar Goud Comments on Phone Tapping Case: గత బీఆర్ఎస్ సర్కారు తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతోనే సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఇవాళ ఆయన హాజరయ్యారు. కేసులో సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు.. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ నాయకుల […]
Telangana Govt extended LRS Scheme Duration: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువును పెంచింది. తాజాగా ఈ నెల 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ల్యాండ్ క్రమబద్దీకరణకు మార్గం సుగమం కానుంది. అలాగే గడువు పెంపుతో పాటు 25 రాయితీ కూడా ఈ నెలాఖరు వరకు వర్తించనుంది. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 7 […]
Telangana Govt. Releases Rythu Bharosa Funds: రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిన్న రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఒక్కరోజులో 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2349.83 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు రూ. 812.6 […]
PCC Chief Mahesh Kumar Goud warns Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు […]
Telangana Inter Supply Results Out: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్, ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా వీరికి మే 22 నుంచి మే 29 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇవాళ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ […]
2 Killed in Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం […]
PGECET Entrance Exams from Today: రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి పీజీఈసెట్- 2025 ఆన్ లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ నేటి నుంచి జరగనున్నాయి. ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాల అనంతరం పీజీఈసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ […]
KTR Attend to ACB Enquiry: ఫార్ములా ఈ కార్ రేసు కేసును ఆరు నెలలుగా విచారిస్తున్నారని.. ఇప్పటికీ ఏం తేల్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతోందని విమర్శించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని తెలిపారు. కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ఇవాళ […]
Road Extend Works in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి వివాదాలు […]