Home / latest crime news
ఇటీవల కాలంలో పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రోజూ ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుమంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఇంటర్మీడియట్ చదువుతున్న తన సహచర విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరించి మరీ తనపై అఘాత్యాయికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.
తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) సీనియర్లు జూనియర్లతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని పలువురిని షాక్ కి గురి చేసింది. బట్టలు విప్పించి మరీ వారి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆమ్లెట్ ఇష్టపడివారుండరు అనడంలో అతిశయోక్తి లేరు. శాఖాహారులు సహా మాంసాహారుల వరకు భోజనప్రియులైన వారు ఆమ్లెట్ అంటే లొట్టలేసుకుంటారు. అందులోనూ మందుబాబులైతే స్టఫ్ గా దానిని తెగ ఎంజాయ్ చేస్తారనుకోండి. అయితే నోట్లో వేసుకోగానే అమాంతం జారిపోయే ఈ ఆమ్లెట్ కూడా ప్రాణాలు తీస్తుందని ఎవరికైనా తెలుసా. గుడ్డు ఆమ్లెట్ తిని ఓ వ్యక్తి మరిణించాడు.
అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ రోజు తెల్లవారు జామున తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మహబూబ్ నగర్లో ట్రావెల్ బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు.