Home / Andhrapradesh News
తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదేంటని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఆటకని వెళ్లిన పిల్లలు శవాలై వచ్చారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో 5 మంది గల్లంతైన ఘటన శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం నేడు కడప వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
"సైకో పోవాలి సైకిల్ రావాలని" రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్థాపించిన స్కిల్ డెవల్పెమెంట్ సెంటర్స్ విషయంలో స్కాం జరిగిందంటూ ఈడీ ఎంక్వైరీ చేపట్టడం ఏంటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకా భార్య, కుమార్తెకు విచారణపై అసంతృప్తి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
తెలంగాణ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.