Home / తెలంగాణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కొరడాతో కొట్టుకున్నారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా పోతురాజులు రాహుల్ ను కలిసినపుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వారిగురించి రాహుల్ కు వివరించారు.
భూ పరిపాలన పోర్టల్ ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చి రెండేళ్లు అయ్యాయి. తెలంగాణ ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, అత్యాధునిక సిటిజెన్ ఫ్రెండ్లీ ఆన్ లైన్ పోర్టర్ ధరణిని 2020 నవంబర్ 2న ప్రభుత్వం చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది.
ఈ రోజు తెల్లవారు జామున తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మహబూబ్ నగర్లో ట్రావెల్ బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ను ప్రారంభించారు. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం పై నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు.
రేపటిదినం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు భారీ పోలీసు బందోబస్తును కల్పించిన్నట్లు రాచకొండ సీపి మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.