Last Updated:

Pawan Kalyan EG Tour : రైతన్నల కోసం రంగంలోకి దిగిన పవనన్న.. జనసంద్రంగా మారిన ఉమ్మడి తూ.గో జిల్లా

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటించనున్న విషయం తెలిసిందే. మంగళవారం రాజమహేంద్రవరంకు చేరుకుని అక్కడి నుంచి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల

Pawan Kalyan EG Tour : రైతన్నల కోసం రంగంలోకి దిగిన పవనన్న.. జనసంద్రంగా మారిన ఉమ్మడి తూ.గో జిల్లా

Pawan Kalyan EG Tour : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా రాజమహేంద్రవరంకు చేరుకుని అక్కడి నుంచి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శిస్తారు. తర్వాత   కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో జనసేన నేతలు భారీగా చేరుకొని పవన్ యాత్రకు అండగా నిలుస్తున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిలక్ష్య ధోరణిని ఖండిస్తూ.. రైతుల కోసం అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ కి జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే భారీగా జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జానా సంద్రంగా మారింది.