Last Updated:

Munugode By Poll: మునుగోడులో టిఆర్ఎస్ ఓడిపోక తప్పదు

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదంటూ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు

Munugode By Poll: మునుగోడులో టిఆర్ఎస్ ఓడిపోక తప్పదు

Hyderabad: మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదంటూ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఈటెల సీఎం కేసిఆర్ పై తీవ్రస్ధాయిలో విమర్శించారు. టిఆర్ఎస్ ఫ్యూజ్ పీకేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీజేపీని గెలిపించేందకు అక్కడి ప్రజలు డిసైడ్ అయ్యారని ఈటెల పేర్కొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో ఈటల అసెంబ్లీకి రాలేదు. సంజయ్‌ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కుత్బుల్లాపూర్ నుండి ప్రారంభమైంది. పాదయాత్ర 10 రోజులు, 115 కిలోమీటర్లు మేర జరుగనుంది. ముందుగా చిత్తారమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: