Home / Sensex
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్ తో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 21,250 దిగువకు చేరింది. సోనీ కంపెనీతో డీల్ రద్దవడంతో జీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్ను తాకడం విశేషం. దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సరి కొత్త రికార్డులను తిరగరాస్తూనే ఉంది. మంగళవారం ట్రేడింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో సానుకూల వాతావరణం ప్రభావం సైతం మన మార్కెట్లపై కనిపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్నే కొనసాగించాయి. రేపు ఆర్బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 62, 969 దగ్గర ట్రేడ్ అయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్ గా ముగిశాయి. ఉదయం నిదానంగా ప్రారంభమైన సూచీలు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల ఆఖరి అరగంటలో కొనుగోళ్లు అండ లభించినా బలమైన లాభాలను ట్రేడ్ చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతి కూల సంకేతాలు దేశీయ మార్కెట్లు ఎఫెక్ట్ చూపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ను కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి అమ్మకాలు వెల్లువెత్తాయి.