Home / latest Telangana news
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణికం ఠాగూర్పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టారు. సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్న మేడిపల్లి ఎస్సై శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్సై శివకుమార్ పై కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు.
హైదరాబాద్ లో సోషల్ మీడియా సంచలనం గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఆమె దుకాణాన్ని మూసివేయించిన పోలీసులు వేరే చోటకు మార్చాలని ఆదేశించిన విషయం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని తెలిపింది.
లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిల్మ్లో నటించే లావణ్య మత్తుకు బానిస అయి చివరికి పోలీసులకు పట్టుబడింది. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువుకోసం హైదరాబాద్ వచ్చింది. గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది.
తెల్లాపూర్లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేష్తో పాటు హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారించింది.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ను కోర్టు ఆదేశించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్పీఎస్సీ ) ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ యాదయ్య, వై.రామ్మోహన్ రావులను ప్రభుత్వం నియమించింది.