Home / BJP
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను చికిత్సకోసం లక్నో తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో మరణించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత షెడ్యూల్ ఖరారైంది. 10 రోజులపాటు 9 నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర 10 రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దాన్ని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.
మంత్రి హరీష్ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్షీట్ విడుదల చేసింది.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.
తెలంగాణలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఆ రోజు హైదరాబాద్లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.
కేసీఆర్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.