Published On:

RJD: ఆర్‌జేడీ అధ్యక్షుడిగా మరోసారి మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ఎంపిక

RJD: ఆర్‌జేడీ అధ్యక్షుడిగా మరోసారి మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ఎంపిక

Former CM Lalu Prasad elected as RJD president Again: రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడిగా మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరోసారి ఎంపికయ్యారు. శనివారం జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్‌ అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్‌జేడీ కార్యవర్గ సమావేశం జరిగింది. రామచంద్ర పుర్వే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాలూను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. లాలూ ప్రసాద్ నాయకత్వంలో పార్టీ మరోసారి ఎన్నిలకు సిద్ధమవుతున్నది. లాలూ జూలై 5, 1997న తన సహచరులతో కలిసి ఆర్‌జేడీని స్థాపించారు.

 

అప్పటి నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆర్‌జేడీ అధ్యక్షుడి బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. లాలూ ఆరోగ్యం గతంలో బాగలేకపోవడే కారణం. కొంతకాలంగా తరుచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా అన్ని ఊహాగానాలకు గుడ్‌బాయ్ చెబుతూ లాలూ జూన్‌ 23వ తేదీన పార్టీ కార్యాలయంలో అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎవరూ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడకపోవడంతో ఎన్నికల అధికారి డాక్టర్‌ రామచంద్ర పూర్వే ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: