Published On:

Actor Suman: జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సినీనటుడు సుమన్

Actor Suman: జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సినీనటుడు సుమన్

Actor Suman: అనంతపురంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌గౌడ్ ఇంటికి వెళ్లిన సుమన్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం, పరిపాలనా దక్షత, విజన్ ఉన్న చంద్రబాబు వంటి నాయకుడు సీఎంగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు. తన రాజకీయ రీ-ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

 

చంద్రబాబే నా తొలి రాజకీయ గురువు..
తన తొలి రాజకీయ గురువు చంద్రబాబేనని సుమన్ తేల్చిచెప్పారు. ఆయన్ను చూసే సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. విజన్ ఉన్న ఆయన నాయకత్వంలో ఏపీ రాజధాని అమరావతి త్వరితగతిన పూర్తయి అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. తొలిసారి వాజ్‌పేయి, చంద్రబాబు హయాంలో రాజకీయాల్లో అడుగుపెట్టానని తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

 

47 ఏళ్ల నటనపై అనుభవం ఉన్న సుమన్ 1978లో నీచల్ కులమ్ (తమిళ)తో తెరగేంట్రం చేశారు. ఇద్దరు కిలాడీలు చిత్రంతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 90వ దశకంలో తిరుగులేని హీరోగా గుర్తింపు సంపాదించారు. అనంతరం క్యారెక్టర్, విలన్ రోల్స్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2021లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కాన్ని అందుకున్నారు. నటనలో కొనసాగుతూ 1999లో టీడీపీలో చేరారు. పార్టీకి మద్ధతుగా పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2004లో బీజేపీలో చేరారు.

ఇవి కూడా చదవండి: