Home / AP Politics
"సైకో పోవాలి సైకిల్ రావాలని" రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్థాపించిన స్కిల్ డెవల్పెమెంట్ సెంటర్స్ విషయంలో స్కాం జరిగిందంటూ ఈడీ ఎంక్వైరీ చేపట్టడం ఏంటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పర్యటనపై రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ ప్రజలను కలుసుకోకుండా ఎందుకు రాష్ట్రప్రభుత్వ నేతలు ఇంతగా ఆంక్షలు పెడుతున్నారు అనేది పలువురి ప్రశ్న. మరి దీనిపై ఈ ప్రత్యేక కథనం చూసేద్దామా..
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కాంలో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వైకాపా నేత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని గురువారం స్పష్టం చేశారు
ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు శ్రీనివాసులును కారుతో ఢీ కొట్టాడు.
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు.
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.