Home / పొలిటికల్ వార్తలు
భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న జససేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి
వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.
గోవా కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది గోవా శాసనసభ్యుల్లో కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు 11 మంది. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మిగలగా, ఆరు మంది బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతుండం పట్ల కాంగ్రెస్ అధిష్టానం
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.